వచ్చే నెలలో రూ.1,120 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల: పవన్కల్యాణ్

భారత్ న్యూస్ రాజమండ్రి ….వచ్చే నెలలో రూ.1,120 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల: పవన్కల్యాణ్

📍పెండింగ్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లు వచ్చే నెల మొదటి వారంలో పంచాయతీలకు విడుదల వుతాయని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ప్రకటించారు. ‘ఆర్దిక సంఘం నిధుల విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులకు ఉపశమనం కలగనుంది. హామీ ఇచ్చినట్లు గానే ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల్లో సద్వినియోగం చేయాలన్న దృఢమైన వైఖరిని ప్రభుత్వం తీసుకుంది. స్థానిక స్వపరిపాలనను బలో పేతం చేస్తూ గ్రామ స్థాయిలో కనీస మౌలిక వసతులు, సేవలు సమ ర్థంగా అందించాలన్నదే మా ఉద్దేశం. రాష్ట్రానికి ఆర్థిక సంఘం నిధులు సకాలంలో విడుదల చేసినందుకు ప్రధాని మోదీకి, సీఎం చంద్రబాబుకు హృదయపూర్వక ధన్య వాదాలు’ అని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను ఇతర పథకాలకు మళ్లించిందని విమర్శించారు.