కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం..

…భారత్ న్యూస్ హైదరాబాద్….కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం..

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

సెక్షన్ 21(3) తొలగింపునకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్ఢినెన్స్‌ను ప్రభుత్వం తీసుకురానుంది.

_కాగా, స్థానిక ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జివొలు 9, 41, 42ల అమలును రాష్ట్ర హైకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది.