భారత్ న్యూస్ హైదరాబాద్….పూజారి చావుకు కారణమైన యువకుడికి జీవిత ఖైదు.
పూజారిపై దాడి చేసిన ఘటనలో సయ్యద్ హుస్సేన్ కు పాపం పండింది. వరంగల్ పోచమ్మ మైదానం దగ్గర సాయిబాబా ఆలయంలో అర్చకుడిగా పనిచేసిన సత్యనారాయణపై 26 అక్టోబర్ 2018న దాడిలో గాయపడ్డ పూజారి నవంబర్ 1న చికిత్స పొందుతూ హైదరాబాదులో మృతి చెందాడు. నిందితునికి వరంగల్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది.
