భారత్ న్యూస్ రాజమండ్రి…మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. బాధ్యత లేని నిర్ణయం
పీపీపీ విధానాన్ని అడ్డుకుని తీరతాం
ప్రజా ఉద్యమంతో ప్రభుత్వ మెడలు వంచుతాం
కూటమి సర్కార్కు మాజీ మంత్రి ధర్మాన హెచ్చరిక
📍మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో ప్రజలను ప్రైవేటు ఆస్పత్రులకు బలిచ్చే కార్యక్రమం వెంటనే ఆపాలని, లేదంటే వైయస్సార్సీపీ తరఫున ఉద్యమిస్తామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీకాకుళంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… విద్య, వైద్య రంగాలను ప్రైవేటు యాజమాన్యాల కిందకు తీసుకువెళ్ళి, విద్యార్ధులు, పేదల జీవితాలతో చెలగాటం ఆడేందుకు కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజా పోరాటంతోనే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. బాధ్యతారహితంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్కార్ మెడలు వంచి, దానిని ఉపసంహరించుకునే వరకు వెనకడుగు వేయబోమని పేర్కొన్నారు. ప్రజారోగ్యాన్ని బలిపీఠం మీద పెడితే బాధ్యతయుతమైన ప్రతిపక్షంగా సహించేది లేదని అన్నారు. ఆయన ప్రెస్మీట్.. ఆయన మాటల్లోనే..
ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా భావించాలి. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి నాణ్యమైన వైద్యం పొందే పేదవాడి హక్కును కాలరాసింది. ఉచిత వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చేశారు. దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ తీవ్రమైన చర్చ జరుగుతోంది. గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేసినా రాష్ట్రంలోని వైయస్ జగన్ నేతృత్వంలో సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల ప్రాణాలను కాపాడగలిగాం. నాడు కరోనా విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్న రాష్ట్రం ఏపీ మాత్రమే. ప్రజారోగ్యం, సమస్యల పరిష్కారం పట్ల వైయస్ జగన్ కి ఉన్న చిత్తశుద్దిని దేశం మొత్తం చూసింది. ఆయన స్పందించిన తీరుకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కరోనా భయాన్ని అడ్డం పెట్టుకుని ప్రైవేటు ఆస్పత్రులు ప్రజలను దోచుకుంటున్న తరుణంలో ఉచితంగా వైద్యం అందించి కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వ ఆస్పత్రులు పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రభుత్వ ఆస్పత్రులతో సమర్థవంతంగా పనిచేయించుకోవడంలోనూ గత వైయస్ జగన్ నేతృత్వంలోని అధికారులు విజయవంతంగా పనిచేశారు. కరోనా సందర్భంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న ఎన్నో కుటుంబాలు ఒకపక్క కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధతోపాటు ఇంకోపక్క ఆర్థికంగా చితికిపోయి ఇప్పటికీ ఆ కష్టాల నుంచి తేరుకోలేకపోతున్నారు. కరోనా లాంటి దుస్థితిని చూశాక కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం తీసుకోవడం ప్రతిఒక్కర్నీ తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటైన ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి ప్రభుత్వ సంపదన ప్రైవేటుకు దోచిపెట్టడం ధర్మమేనా అని ఆలోచించుకోవాలి. కూటమి ప్రభుత్వం వైద్యం పట్ల ప్రజల్లో భరోసా కల్పించలేకపోతోంది. ఇప్పుడు కరోనా లాంటి విపత్తు ఎదురైతే ప్రాణాలతో ఉంటామన్న ఆశ నేడు ప్రజల్లో సన్నగిల్లిపోయింది.
ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిందిపోయి…
నాణ్యమైన ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. నాణ్యమైన వైద్యం కోరుకోవడం రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కు. వాటిని కూడా నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని 16 నెలల పాలనతోనే స్పష్టమైంది. ప్రతి పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలన్న గొప్ప లక్ష్యంతో నాటి సీఎం వైయస్ జగన్ 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఏడు కాలేజీలను పూర్తి చేశారు. రూ. 500 కోట్ల నిర్మాణ వ్యయంతో 50 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీతోపాటు టీచింగ్ హాస్పటల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ, బీ, సీ మూడు కేటగిరీల్లో ఫీజులు నిర్ణయించి, 50 శాతం సీట్లకు కేవలం రూ. 15వేల ఫీజు నిర్ణయించారు. నిధుల కొరత కారణంగా ఆస్పత్రి నిర్వహణకు ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో 15 శాతం సీట్లను ఎన్నారై కోటా కింద భర్తీ చేయడం జరిగింది. మెడికల్ కాలేజీలను పీహెచ్సీలు, సీహెచ్సీలతో అనుసంధానం చేయడం జరుగుతుంది. ప్రతిజిల్లాలో మెడికల్ కాలేజీ చుట్టూ ఒక మెడికల్ హబ్ ఏర్పాటవుతుంది. ఆ జిల్లా పరిధిలో మెడికల్ సిస్టం మొత్తం ఒకే గొడుగు కిందకు వస్తుంది. కాలేజీలు పూర్తయి అందుబాటులోకి వస్తే ప్రైవేటు ఆస్పత్రుల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. ఇంత విశాల దృక్పథంతో కాలేజీల ఏర్పాటు జరిగితే వాటిని ప్రైవేటుపరం చేయాలనుకోవడం ఎంతమాత్రం సరైన నిర్ణయం కాదు. ప్రజల వైద్యం భారాన్ని మోయలేమని ప్రభుత్వం అనుకుంట…
