మోట్లపల్లి గ్రామంలో విషాదం ఈతకు వెళ్లిన ముగ్గురు పిల్లలు వారిలో ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం

భారత్ న్యూస్ గుంటూరు..బ్రేకింగ్ న్యూస్

మోట్లపల్లి గ్రామంలో విషాదం ఈతకు వెళ్లిన ముగ్గురు పిల్లలు వారిలో ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలం కృష్ణాపురం పంచాయతీ మోట్లపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ముగ్గురు పిల్లలు సరదాగా చెరువు వద్దకు ఈత కొట్టడానికి వెళ్లి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలుని హాస్పిటల్ తరలించారు ప్రస్తుతం ఆ బాలుడు పరిస్థితి కూడా విషమంగా ఉందని అన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాలు సేకరిస్తున్నారు.మరిన్ని వివరాలు పోలీసుల వారి దర్యాప్తులో తెలియనున్నది.