ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి ముఖ్యాంశాలు:

భారత్ న్యూస్ అనంతపురం….ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి ముఖ్యాంశాలు:

అమరావతి :

  1. కాలపరిమితి ముగింపు

1వ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలు 2021లో జరిగాయి.

వాటి ఐదు సంవత్సరాల పదవీకాలం 02-04-2026న ముగియనుంది.

  1. సంవిధాన నిబంధన

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243E(3)(a) ప్రకారం, గ్రామపంచాయతీలకు ఎన్నికలు ఐదు సంవత్సరాల గడువు పూర్తయ్యే ముందు తప్పనిసరిగా పూర్తి చేయాలి.

సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కాలపరిమితి ముగియకముందే జరగాలి అని స్పష్టం చేశారు.

  1. ప్రభుత్వ భాధ్యతలు

ప్రభుత్వం నిర్వహించవలసిన ఎన్నికల ముందు పనులు:

గ్రామపంచాయతీలు, వార్డుల పునర్విభజన (Delimitation).

ప్రజా సంకల్ప వేదిక డిమాండ్ …..రిజర్వేషన్ల ఖరారు (BCలకు Triple Test Formula ప్రకారం)
గ్రామపంచాయతీల విలీనం/నగరపాలక సంస్థలుగా అప్‌గ్రేడ్ చేయడం.

రిజర్వేషన్లు ఖరారు అయిన తర్వాతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వగలదు.

  1. ప్రజా సంకల్ప వేదిక పరిశీలన మేరకు గత సమస్యలు

2021లో 331 గ్రామపంచాయతీలకు చట్టపరమైన మరియు పరిపాలనా కారణాలతో ఎన్నికలు జరగలేదు.

ఈసారి 2026 ఎన్నికలతో సమకాలీకరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

  1. ప్రాథమిక షెడ్యూల్ (Pre-Election Schedule)

అక్టోబర్ 15, 2025లోపు: గ్రామపంచాయతీ విలీనం/అప్‌గ్రేడ్ ప్రతిపాదనలు.

నవంబర్ 15, 2025లోపు: ఓటరు జాబితా తయారీ & ప్రచురణ.

నవంబర్ 30, 2025లోపు: పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు & Ballot/EVMలు సిద్ధం చేయడం.

డిసెంబర్ 15, 2025లోపు: రిజర్వేషన్ల ఖరారు. ప్రజా సంకల్ప వేదిక డిమాండ్

జనవరి 2026: ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, ఎన్నికల షెడ్యూల్ ప్రారంభం.

👉 అంటే, ఆంధ్రప్రదేశ్‌లో గ్రామపంచాయతీ ఎన్నికలు మార్చి-ఏప్రిల్ 2026కి ముందే పూర్తి చేయాలి, అందుకోసం ప్రభుత్వం తక్షణమే ముందస్తు పనులు ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది