భారత్ న్యూస్ విశాఖపట్నం..భారత నావికాదళం అమ్ముల పొదిలోకి మరో నౌక వచ్చి చేరింది.
కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్ లో INS ఇక్షక్ జలప్రవేశ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
80 శాతం స్వదేశి పరిజ్ఞానంతో ఈ INS ఇక్షక్.. ఆత్మనిర్భర్ భారత్లో మరో కీలక అడుగుగా నిలిచింది.
ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి INS ఇక్షక్ ను జాతికి అంకితం చేశారు.
