భారత్ న్యూస్ రాజమండ్రి…భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
అసెంబ్లీ, సచివాలయం ప్రాంగణాల్లోని రహదారులు, సెంట్రల్ పార్కు విద్యుత్ వెలుగులతో మెరుస్తోంది.
విజయవాడలో గల లోక్ భవన్, ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, ప్రకాశం బ్యారేజ్, ఇతర చారిత్రక ప్రాముఖ్యత గల భవనాలన్నీ గణతంత్ర కళ సంతరించుకున్నాయి.
