.భారత్ న్యూస్ హైదరాబాద్….మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మల్లికార్జున ఖర్గే వార్నింగ్
బహిరంగంగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పట్ల కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన క్రమంలో.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో దాదాపు గంట సేపు భేటీ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మంత్రి పొంగులేటి తీరు నచ్చక తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసి కొందరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం
అలాగే గతంలో బాంబులు పేలతాయని.. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి పొంగులేటి
బహిరంగంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దని పొంగులేటిని హెచ్చరించిన మల్లికార్జున్ ఖర్గే
రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమన్వయంగా ఉండాలని పొంగులేటికి సూచించిన మల్లికార్జున్ ఖర్గే
