..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
♦️రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలకన్నా ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకే ఎక్కువ ప్రయత్నం చేస్తున్నది.
♦️బనకచెర్ల ద్వారా ఆంధ్రాకు సాగునీటిని తరలించుకు పోయే ప్రయత్నాలకు ఈ ప్రభుత్వం సహకరిస్తుంది.
♦️మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించిన తర్వాతనే ఈ ప్రభుత్వం బనకచెర్ల విషయంలో స్పందించింది .. అఖిలపక్ష సమావేశంలో రాజకీయాలు మాట్లాడడంతో పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆయన సమావేశం నుండి బయటకు వచ్చారు.
♦️ఈ సమావేశంలో, ఆ తర్వాత రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎంపీ, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన వద్దిరాజును కించపరిచినట్లు మాట్లాడారు .. సీఎంకు ఈ విషయంలో ఏదో పాండిత్యం ఉన్నట్లు మాట్లాడారు .. బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఏదో సాధించినట్లు వారిని పొగిడారు.
♦️కేంద్ర అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలను ఒప్పందంగా చిత్రీకరించడం సీఎం రేవంత్ రెడ్డి అవగాహనా రాహిత్యానికి నిదర్శనం .. సమావేశంలో ఎవరు ఏం మాట్లాడినా రికార్డ్ చేస్తారన్న విషయం తెలియకపోవడం విడ్డూరం.
♦️మొత్తం సమావేశంలో బనకచర్లను ఖచ్చితంగా అడ్డుకుని తీరతాం అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పడం లేదు ?
♦️పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.32,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఖర్చు చేసింది .. ఇక్కడ కేవలం 172 ఎకరాలు మాత్రమే సేకరించాల్సి ఉంది .. ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తయ్యాయి.
♦️పాలమూరు కరువును శాశ్వతంగా రూపుమాపే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను కేంద్ర ప్రభుత్వం వెనక్కు పంపింది.. మిగిలిన పనులు పూర్తి చేసి వెంటనే నీటి కేటాయింపులు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పట్టించుకోవడం లేదు.
♦️రేవంత్ మాట్లాడే భాష ఆయనకు అందంగా అనిపించవచ్చు .. కానీ ముఖ్యమంత్రి హోదాకు అది తగదు.. మీరు మాట్లాడే భాష మీ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.
♦️కృష్ణా నీళ్ల విషయంలో తెలంగాణ ఇప్పటికే నష్టపోయింది.. తెలంగాణ పోరాటమే నీళ్ల కోసం జరిగింది.. ఏపీలో కేవలం తెలుగుగంగకు మాత్రమే నీటి కేటాయింపు ఉంది.. కానీ ఆంధ్రాలో 300 టీఎంసీల సామర్ధ్యం గల రిజర్వాయర్లు నిర్మించుకున్నారు .. ప్రస్తుతం కృష్ణా నదిలో తగినంత నీరు అందుబాటులో లేదు.
♦️కృష్ణా బేసిన్ కు కాళేశ్వరం ద్వారా సాగునీటిని తరలించాలన్న ఆలోచన కేసీఆర్ గారికి ఉన్నది .. తెలంగాణ ప్రయోజనాలు, ఇక్కడి అవసరాలు తీరిన తర్వాత మీగిలిన ప్రాంతాలకు సాగునీరు ఇస్తామని కేసీఆర్ అన్నారు.. దీనికి నిన్న, నేడు, రేపు ఎప్పటికి కట్టుబడి ఉంటాం.
♦️కేసీఆర్ లేకుంటే, తెలంగాణ తేకుంటే రేవంత్ రెడ్డి ఎక్కడ ఉండేవాడు.. ప్రతి అంశంలో తెలంగాణను కించపరిచి, తెలంగాణను అవహేళన చేసి మాట్లాడడం తగదు .. ఇదొక మానసిక రుగ్మత అనిపిస్తుంది.
♦️అఖిలపక్షంలో ప్రతిపక్ష పార్టీలను ఎందుకు పిలుస్తారు? ప్రభుత్వ ఉద్దేశం ఏంటో చెప్పాలి.. కానీ అధికారుల ముందు రాజకీయాలు ఎలా మాాట్లాడతారు?
♦️బనకచెర్ల ప్రాజెక్టు నేపథ్యంలో నాగార్జున సాగర్ కాలువలను వెడల్పు చేస్తున్నది.. ఇది రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకం.. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా నిలదీయడం లేదు.
♦️రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా సాగునీటి పంపకాలు, ప్రాజెక్టుల గురించి అపెక్స్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కోరడం లేదు ? అపెక్స్ సమావేశం ఏర్పాటు చేయకుంటే ప్రాజెక్టులకు అనుమతులు ఎలా వస్తాయి?
♦️బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాంటి ఫీజబులిటీ లేకున్నా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించగానే రూ.82 వేల కోట్లు ఖర్చయ్యే పథకానికి ఏకంగా 50 శాతం భరిస్తామని హామీ ఇవ్వడం దేనికి నిదర్శనం .. తెలంగాణ మీద బీజేపీకి ఉన్న కక్షకు ఇది నిదర్శనం.. ఇది తెలంగాణకు గొడ్డలిపెట్టు.
♦️కనీసం తెలంగాణను సంప్రదించాలన్న ఉద్దేశం కూడా కేంద్రానికి లేదు .. నదుల అనుసంధానం కింద ఇది ఇంటిగ్రేట్ అవుతుందని ఏపీ కేంద్రాన్ని ఒప్పించుకుంది … తెలంగాణ ప్రభుత్వానికి అధికారం మీద తప్ప ప్రజా ప్రయోజనాలు, ప్రాంత ప్రయోజనాల మీద ముందు చూపు లేదు
♦️ఏ ప్రాజెక్టు, ఏ నది నుండి ఎంత నీళ్లు వస్తాయి అని పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్ ను వదులుకున్నామని తెలంగాణ రైతాంగం భావిస్తున్నది
♦️కానీ రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర ఈ సాగునీటి అవసరాల గురించి ఏ మాత్రం అవగాహన లేదు.. మీడియా సమావేశంలో రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతుంటే మంత్రులు వారించరా?
♦️నిజంగా రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అయితే ఇన్నేళ్లు మేము సాగునీళ్లు కోల్పోయినం అని అధికారంలోకి వచ్చిన మొదటిరోజే కేంద్రానికి నీళ్లను కేటాయించాలని లేఖ రాయాాల్సింది.
♦️గోదావరి నుండి బనకచర్లకు నీళ్లను తీసుకపోతున్న నేపథ్యంలో మరి ఇప్పటికే క్రిష్ణా నది నుండి నీళ్లు తీసుకుపోతున్నందున ఇక మీదట క్రిష్ణా నది నుండి నీళ్లు తీసుకుపోవద్దని రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఎందుకు లేఖ రాయడం లేదు ? ప్రభుత్వానికి ఒక విధానం లేదా ? ఇప్పటి వరకు తీసుకువెళ్తున్న నీళ్లను బంద్ పెట్టాలని ఎందుకు అడగడం లేదు ?
♦️ముఖ్యమంత్రి స్థానానికి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు.. నిజంగా ఉరితీయాల్సి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉరితీయాలి
♦️హామీలు ఇచ్చి ఎగ్గొట్టినందుకు, పచ్చబడ్డ తెలంగాణను ఎండబెట్టినందుకు, రూ.15 వేలు రైతుభరోసా ఎగ్గొట్టినందుకు, రూ.4000 వేల ఫించన్ ఇవ్వనందుకు, క్వింటాలుకు బోనస్ రూ.500 బోనస్ ఎగ్గొట్టినందుకు మీ ప్రభుత్వాన్ని ఉరితీయాలి.
♦️రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిలోపల ఇస్తామని ఇవ్వనందుకు మీ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు ఉరితీయాలి.
♦️విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని ఇవ్వనందుకు మీ ప్రభుత్వాన్ని ఉరితీయాలి.
♦️పదేళ్లలో పూర్తి చేసిన ప్రాజెక్టుల గురించి చెప్పమంటారు .. తెలంగాణలో ప్రాజెక్టులను పూర్తి చేసిందే కేసీఆర్ ప్రభుత్వం .. కాంగ్రెస్ ప్రభుత్వానికి నీటి మీద, నీటి ప్రాజెక్టుల మీద, పరివాహక ప్రాంతాల మీద అవగాహన, చిత్తశుద్ది లేదు
♦️పాలమూరులో నాలుగు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం .. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డంకులు వేసినా రూ.32,500 కోట్లతో పనులు చేసింది కేసీఆర్ ప్రభుత్వం
♦️మిగిలిన పనులు పూర్తి చేయకుండా రేవంత్ రెడ్డి ఏడాదిన్నరగా కాలయాపన చేస్తున్నారు .. పాలమూరు ఎత్తిపోెతల పనులను ఏ కారణం చేత ఎందుకు ఆపారో రేవంత్ ప్రజలకు చెప్పాలి
♦️నీళ్లు లేని చోట కొడంగల్ ఎత్తిపోతల చేపట్టారు .. దాని భవిష్యత్తు ఏమవుతుందో వేచిచూడాలి
♦️ప్రభుత్వ చేతగాని తనాన్ని, ఏపీకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వ వైఖరిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద నెపం పెడుతున్నారు .. రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా హర్షించరు
♦️రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకున్నది
♦️పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండడం పాలకుల లక్షణం .. కానీ తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్, కేసీఆర్ గారు పట్టుబడతారు

తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి నిరంజన రెడ్డి