డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పథకానికి హైదరాబాద్‌కు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రాటెక్ లిమిటెడ్ సుమారు 40 లక్షల విలువైన నోట్ పుస్తకాలు, పెన్నులను విరాళంగా అందించింది

భారత్ న్యూస్ మంగళగిరి…డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పథకానికి హైదరాబాద్‌కు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రాటెక్ లిమిటెడ్ సుమారు 40 లక్షల విలువైన నోట్ పుస్తకాలు, పెన్నులను విరాళంగా అందించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే నోట్ పుస్తకాల పంపిణీని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్‌తో పాటు కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రా టెక్ లిమిటెడ్ ఎండీ కేఎల్ శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ కే.ప్రీతమ్ రెడ్డి, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు…