భారత్ న్యూస్ మంగళగిరి…ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజులు ఖరారు
ఆంధ్రప్రదేశ్ :
విద్యా హక్కు చట్టం కింద ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో తాజాగా ఫీజులు ఖరారు చేసింది.
స్కూళ్లలో వసతుల ఆధారంగా రేటింగ్ను బట్టి ఫీజులు నిర్ణయించింది.
స్కూళ్లకు ఒక స్టార్ ఉంటే రూ.8,500, రెండు స్టార్లు ఉంటే రూ.10 వేలు, 3 స్టార్లు ఉంటే రూ.11,500, 4 స్టార్లు ఉంటే రూ.13 వేలు, 5 స్టార్లు ఉంటే రూ.14,500గా ఫీజును ఖరారు చేసింది.
ఈ ఫీజును రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద పాఠశాలలకు చెల్లిస్తుంది.
