భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.మున్సిపల్ ఎన్నికలను చట్ట ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని డీజీపీ బి.శివధర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు, ఎస్హెచ్ఓలతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, 414 వార్డులతో పాటు 2,582 వార్డుల్లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
