ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి : డీజీపీ బి.శివధర్ రెడ్డి

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.మున్సిపల్ ఎన్నికలను చట్ట ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని డీజీపీ బి.శివధర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు, ఎస్హెచ్ఓలతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, 414 వార్డులతో పాటు 2,582 వార్డుల్లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.