రామగుండం పోలీస్ కమీషనరేట్,పదవీ విరమణ పొందిన అధికారులను సన్మానించి,జ్ఞాపికలు అంద చేసిన అడిషనల్ డిసిపి అడ్మిన్ గారు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…రామగుండం పోలీస్ కమీషనరేట్


తేది:30-09-2025

పదవీ విరమణ పొందిన అధికారులను సన్మానించి,జ్ఞాపికలు అంద చేసిన అడిషనల్ డిసిపి అడ్మిన్ గారు

శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలి : అడిషనల్ డిసిపి అడ్మిన్ శ్రీనివాస్

పోలీస్ శాఖ నందు సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ గారి  కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ శ్రీనివాస్ గారు  పాల్గొని పదవీ విరమణ పొందుతున్న నలుగురు   పోలీసు అధికారులు, కుటుంబ సభ్యులతో  కలిసి శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

 ఈరోజు పదవీ విరమణ పొందిన ఆర్ శ్రీహరి ఆర్ ఎస్ ఐ, బి భాస్కర్ ఏ ఎస్ ఐ, కె. రమేష్ ఏ ఆర్ ఎస్ ఐ, సిహేచ్. లక్ష్మయ్య హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్ గా ఎంపికై  అంచలంచలుగా పదోన్నతి పొంది కుటుంబ సభ్యుల సహకారంతో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంఘవిద్రవశక్తులతో పోరాడి యాంటి ఎక్స్మిస్ట్ ఆపరేషన్ నందు విధులను నిర్వర్తించి, ప్రస్తుత పోలీసు వ్యవస్థ ప్రశాంతంగా కొనసాగడానికి కీలకపాత్రను పోషించి విజయవంతంగా పదవి విరమణ పొందడం జరిగింది.

ఈ సందర్భంగా అడిషనల్ డిసిపి అడ్మిన్ గారు మాట్లాడుతూ…… గతంలో పోలీసు వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితుల నందు సంఘవిద్రోహశక్తులతో పోరాడి కీలకంగా విధులను నిర్వర్తించి ప్రస్తుతం పోలీసు వ్యవస్థ ప్రశాంతంగా ఉండడానికి గల కారణమైన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. సుదీర్ఘ కాలం పాటు పోలీసు వ్యవస్థను సేవలందించి పదవీ విరమణ పొందుతున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలను పోలీసులు సక్రమంగా విధులను నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందని వారి తోడ్పాటు వల్లనే విధులను నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగగలరని తెలియజేశారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో  తమ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆనందంగా గడపాలని  సూచించారు. తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు.  ఎటువంటి అవసరం ఉన్న కమీషనరేట్ పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. పదవి విరమణ పొందిన అధికారులను ప్రభుత్వ వాహనంలో ఇంటి వరకు సాగనంపడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్ ,  ఐ టీ కోర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు  దామోదర్, శ్రీనివాస్, వామన మూర్తి, మల్లేషం, సూపరింటెండెంట్ లు ఇంద్ర సేనా రెడ్డి, సందీప్, సిసి హరీష్, రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లా కుంట పోచలింగం, స్వామి, పదవి విరమణ అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..