భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…పెరుగుతున్న శ్రీశైలం ఇన్ ఫ్లో
కృష్ణా నదిలో వరద కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్ట్లోకి చేరే వరద క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి శ్రీశైలం డ్యామ్కు 85వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 106.67 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టు ఔట్ ఫ్లో 83వేలు, సుంకేసుల ఔట్ ఫ్లో 1,334 క్యూసెక్కులుగా ఉంది.
