భారత్ న్యూస్ గుంటూరు….ఢిల్లీ….
అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
ఏపి రాజధాని అమరావతి కి చట్టబద్దత కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరాం.
యువత డ్రగ్స్ వినియోగం పై తల్లిదండ్రుల్లో ఆందోళన ఉంది
డ్రగ్స్ ,సోషల్ మీడియా నియంత్రణ పై ఖటిన చట్టాలు రావాలి
దీనిపై పార్లమెంట్ లో చర్చ జరపాలి, యువత డ్రగ్స్ బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి.
విచక్షణ లేకుండా, విచ్చలవిడిగా సోషల్ మీడియాను వాడటం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది.
సోషల్ మీడియా వినియోగం పై పార్లమెంట్ లో చర్చించి, చట్టం చేయాలి.
జల జీవన్ మిషన్ పధకం కింద ఈ బడ్జెట్ లో అన్ని జిల్లాలకు సమృద్ధిగా నిధులను కేటాయించాలి.
తద్వారా, ఏపిలో ప్రతి గ్రామానికి తాగునీరు అందించాలన్నదే మా నాయకుడు పవన్ కల్యాణ్ సంకల్పం.
ఆక్వా కల్చర్ పై అమెరికా పన్ను ప్రభావం తీవ్రంగా ఉంది .
ఈ అంశం పై పార్లమెంటులో విస్తృతంగా చర్చించి, ఆక్వా రైతుల సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యలు తీసుకోవాలి.

పవన్ కల్యాణ్ రెండు రోజల ఢిల్లీ పర్యటనలో ఏపిలోని గ్రామీణ ప్రొంతాలకు రహదారుల నిర్మాణం,సంబంధిత మంత్రిత్వ శాఖలకు నిధుల కేటాయింపు,అమరావతి రాజధానికి చట్టబద్దత అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చిస్తారు
బాల శౌరి,
జనసేన లోక్ సభాపక్ష నేత