భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో నేటి నుంచి సదరం స్లాట్ బుకింగ్స్
అమరావతి :
ఏపీ రాష్ట్రంలోని దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు అందజేయడానికి ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించనుంది. ఇవాల్టి నుంచి సెప్టెంబర్ 30వరకూ అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు సదరం హెల్త్ నోడల్ అధికారి గ్రామ, వార్డు
సచివాలయాల డైరెక్టర్కు లేఖ రాశారు. మీ సేవ లేదా గ్రామ సచివాలయాల్లో సదరం క్యాంపు స్లాట్లు బుక్ చేసుకోవచ్చు.
