భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….బీసీల పాపం….
బీజేపీకి తప్పక తగులుద్ది
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిపి… బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలు… బీసీ ద్రోహులు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అనుకున్నం… మా ముఖ్యమంత్రి ఒక రెడ్డి బిడ్డ అయినప్పటికీ చాలెంజ్ గా తీసుకొని బిల్లును తీసుకొచ్చారు.
ఆర్డినెన్స్ తీసుకొచ్చినం… అసెంబ్లీలో బిల్లు పాయి చేయించుకున్నం. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్ధతు తెలిపిన బీజేపీ… గవర్నర్ ఆమోదం తెలుపకుండా అక్కడ అడ్డుకుంటూ… దొంగాట ఆట ఆడుతున్నది.

రాష్ట్ర గవర్నర్ ఒక్క సంతకం పెట్టి… బీసీ బిల్లుకి ఆమోదం తెలిపి ఉంటే ఎక్కడా సమస్య వచ్చేది కాదు. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేవి. బీజేపీ డ్రామా వల్ల బీసీల ఆశలన్నీ అడియాశలయ్యాయి