BHARATH NEWS DIGITAL: HYDERABAD:
పదోన్నతులు కల్పించినందుకు శత కోటి కృతజ్ఞతలు..
ప్రిన్సిపల్ సెకట్రరీ, కమిషనర్ను కలిసిన గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు..
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో నాలుగు సంవత్సరాల నుంచి పెండిరగ్లో ఉంటు వస్తున్న డీపీసీని ప్రిన్సిపల్ సెకట్రరీ రఘునందన్రావు, ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్లు చొరువ తీసుకొని డీపీసీని క్లియర్ చేయిండం వల్ల ఎక్సైజ్ శాఖలో పని చేసే అధికారులకు పదోన్నతులు వస్తున్నాయని, డీపీసీకి సహకరించిన కమిటీ అధికారులకు గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
బుధవారం ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు ప్రిన్సిపల్ సెకట్రరీ, కమిషనర్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
శాలువతో సన్మానించారు.
ప్రిన్సిపల్ సెకట్రరీని కలిసిన సమయంలో ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిషన్ ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు జె.హరికిషన్, ఇద్దరు అధికారులు ఉన్నారు.

ఇతర అధికారులు ఉన్నారు.
అనంతరం ఇదే సంఘం నాయకులు అబ్కారీ భవన్లో కమిషనర్ హరికిరణ్ను కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కమిషనర్ను కలిసిన వారిలో అధ్యక్షులు హరికిషన్తో అడిషనర్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, జాయింట్ కమిషనర్ సురేష్ రాథోడ్ పాటు వైజ్ ప్రజిడెంట్ చంద్రయ్య, కోశాధికారి డి.శ్రీనివాస్లతోపాటు వరంగల్, మహబూబ్నగర్ డిప్యూటి కమిషనర్లు అంజన్రావు, విజయ భాస్కర్రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ రంగారెడ్డి ఆర్. కిషన్తోపాటు ఈసీలు, ఏఈఎస్లు ఇతర అధికారులు ఉన్నారు.