భారత్ న్యూస్ విశాఖపట్నం..భారత్ చెత్త ఫీల్డింగ్….
ఇంగ్లాండ్ తొలి టెస్టులో భారత ప్లేయర్లు ఫీల్డింగ్లో ఘోరంగా విఫలమయ్యారు. బుమ్రా బౌలింగ్లో యశస్వీ జైస్వాల్ ఏకంగా మూడు క్యాచులు నేలపాలు చేశారు. జడేజా ఓ క్యాచ్ వదిలేశారు. గిల్ సేన చెత్త ఫీల్డింగ్తో ఏకంగా ఆరు క్యాచులు నేలపాలయ్యాయి. ఒక ఇన్నింగ్స్ లో 6 క్యాచులు వదిలేయడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి. ఇంగ్లాండ్ ప్లేయర్లు ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు.
లీడ్స్ టెస్ట్లో 6 పరుగుల ఆధిక్యంలో భారత్
తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్
స్కోర్లు: భారత్ 471, ఇంగ్లాండ్ 465 పరుగులు
పోప్ 106, బ్రూక్ 99, బెన్ 62 పరుగులు
ఐదు వికెట్లు తీసిన బుమ్రా
ప్రసిద్ధ్ కృష్ణకు 3, సిరాజ్కు రెండు వికెట్లు….
