ఆసియా కప్ సమరానికి సర్వం సిద్ధం!

భారత్ న్యూస్ హైదరాబాద్….ఆసియా కప్ సమరానికి సర్వం సిద్ధం!

క్రి­కె­ట్‌ అభి­మా­ను­లు ఎప్పు­డె­ప్పు­డా అని ఎదు­రు చూ­స్తు­న్న ఆసి­యా కప్ 2025 టో­ర్నీ­కి రంగం సి­ద్ద­మైం­ది. మరో నా­లు­గు రో­జు­ల్లో ఈ టో­ర్నీ­కి తె­ర­లే­వ­నుం­ది. సె­ప్టెం­బ­ర్ 9న యూఏఈ వే­ది­క­గా టీ20 ఫా­ర్మా­ట్‌­లో ప్రా­రం­భం కా­నుం­ది. ఇప్పటికే ఒక్కొక్కరుగా దుబాయ్ కి చేరుకున్న భారత ఆటగాళ్లు శుక్రవారం సాయంత్రం నుంచి తొలి ప్రాక్టీస్ సేషన్ ప్రారంభించింది…

ఆతి­థ్య యూ­ఏ­ఈ­తో పాటు భా­ర­త్, పా­కి­స్థా­న్, ఒమన్, శ్రీ­లంక, బం­గ్లా­దే­శ్, హాం­గ్ కాం­గ్, అఫ్గా­ని­స్థా­న్ జట్లు ఈ టో­ర్నీ­లో తల­ప­డు­తు­న్నా­ యి. ఈ 8 జట్ల­ను రెం­డు గ్రూ­ప్‌­లు­గా వి­భ­జిం­చా­రు. యూఏఈ, పా­కి­స్థా­న్, ఒమ­న్‌­తో కలి­సి భా­ర­త్ గ్రూ­ప్-ఏలో ఉంది. లీగ్ దశలో ప్ర­తీ జట్టు ఒక్కో మ్యా­చ్ ఆడ­నుం­ది. టాప్-2లో ని­లి­చిన జట్లు సూ­ప­ర్-4కు అర్హత సా­ధి­స్తా­యి. నా­లు­గు జట్లు మరో­సా­రి ఒక్కో­సా­రి తల­ప­డు­తా­యి.

టాప్-2లో ని­లి­చిన జట్లు ఫై­న­ల్ చే­రు­తా­యి. ఇప్ప­టి­ కే తమ జట్ల­ను ప్ర­క­టిం­చిన ఆయా దే­శా­లు సన్నా­హ­కా­ లు కూడా ప్రా­రం­భిం­చా­యి. యూఏఈ, అఫ్గా­ని­స్థా­న్, పా­కి­స్థా­న్‌ జట్లు సన్నా­హ­కం­గా ట్రై సి­రీ­స్ ఆడు­తు­న్నా­యి. ఇం­గ్లం­డ్ పర్య­టన అనం­త­రం వి­శ్రాం­తి­లో ఉన్న భారత జట్టు మా­త్రం ఇంకా సన్నా­ హ­కా­లు మొ­ద­లు­పె­ట్ట­లే­దు. చేరుకున్న టీమిండియా ఇప్ప­టి­కే టీ­మ్‌­ఇం­డి­యా ప్లే­య­ర్లు దు­బా­య్‌­లో అడు­గు­పె­ట్టే­శా­రు.

ఈసా­రి పొ­ట్టి ఫా­ర్మా­ట్‌ మ్యా­చు­లు కా­వ­డం­తో సర్వ­త్రా ఆస­క్తి నె­ల­కొం­ది. మరో రెం­డు రో­జు­ల్లో టీ­మిం­డి­యా యూ­ఏ­ఈ­కి చే­ర­నుం­ది. తొలి మ్యా­చ్‌­ను యూ­ఏ­ఈ­తో సె­ప్టెం­బ­ర్ 10న ఆడ­ను­న్న భా­ర­త్.. సె­ప్టెం­బ­ర్ 14న దా­యా­దీ పా­కి­స్థా­న్‌­తో తల­ప­డ­నుం­ది. సె­ప్టెం­బ­ర్ 19న ఒమ­న్‌­తో చి­వ­రి లీగ్ మ్యా­చ్ ఆడ­నుం­ది. పా­కి­స్థా­న్, భా­ర­త్ మె­రు­గైన ప్ర­ద­ర్శన చేసి ఫై­న­ల్ చే­రి­తే మూడు సా­ర్లు తల­ప­డు­తా­యి. ఇరు దే­శాల మధ్య ఉద్రి­క్త­తల నే­ప­థ్యం­లో భా­ర­త్, పాక్ పో­రు­పై సర్వ­త్రా ఆస­క్తి నె­ల­కొం­ది.