నేడు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతికి అంకితం

.భారత్ న్యూస్ హైదరాబాద్….నేడు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతికి అంకితం

న‌ల్గొండ జిల్లా యాదాద్రి థ‌ర్మ‌ల్ విద్యుత్ ప్రాజెక్టును నేడు (శుక్ర‌వారం) జాతికి అంకితం చేయ‌నున్నారు.

రాష్ట్రంలో 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం క‌లిగిన తొలి యూనిట్ ఇది.

డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, అడ్లూరి ల‌క్ష్మణ్‌కుమార్ ప్రాజెక్టును ప్రారంభించ‌నున్నారు.

దీంతో పాటు రూ.950 కోట్ల‌తో చేప‌డుతున్న ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ ప‌నుల‌కు మంత్రులు శంకుస్థాప‌న చేయ‌నున్నారు.