..భారత్ న్యూస్ హైదరాబాద్….వెండితో వెడ్డింగ్ కార్డు.. ధర రూ. 25 లక్షలు
రాజస్థాన్ జైపూర్ లో ఓ తండ్రి తన కూతురి పెళ్లి కోసం ఏకంగా 3 కిలోల స్వచ్ఛమైన వెండితో వెడ్డింగ్ కార్డ్ చేయించారు. దీని ధర అక్షరాలా ₹25 లక్షలు. శివ్ జోహ్రీ అనే వ్యక్తి ఏడాది పాటు కష్టపడి, ఒక్క మేకు కూడా వాడకుండా 128 వెండి ముక్కలతో ఈ అద్భుతాన్ని సృష్టించారు. ఇందులో మొత్తం 65 మంది దేవుళ్ల ప్రతిమలను చెక్కించారు. తన కూతురి పెళ్లికి బంధువులతో పాటు సకల దేవతలను ఆహ్వానించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారట….
