గ్యాస్ సిలిండర్‌పై రూ.111 పెంపు

భారత్ న్యూస్ ఢిల్లీ…..గ్యాస్ సిలిండర్‌పై రూ.111 పెంపు

🔸కొత్త ఏడాది తొలిరోజే కేంద్రం భారీ షాక్‌ ఇచ్చింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్‌ ధరను ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఏకంగా రూ.111 పెంచేశాయి.

🔸గురువారం నుంచి కొత్త ధర అమల్లోకి వచ్చింది. గత ఏడాది జూన్‌ తర్వాత ఇంత భారీస్థాయిలో వాణిజ్య సిలిండర్‌ ధర పెరగడం ఇదే మొదటిసారి.

🔸అయితే 14.2 కిలోల గృహోపయోగ వంటగ్యాస్‌ ధరలో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. గడచిన రెండు నెలల కాలంలో రెండు సార్లు వాణిజ్య ఎల్‌పీజీ ధరను చమురు కంపెనీలు తగ్గించాయి.