.భారత్ న్యూస్ హైదరాబాద్….ఉస్మానియా బిస్కెట్లలో విషం.. వెలుగులోకి భయంకర నిజాలు
తెలంగాణ : హైదరాబాద్లోని అంబర్పేట్ ప్రాంతంలో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో, బిస్కెట్లకు ఆకర్షణీయమైన రంగులు అద్దడానికి ప్రాణాంతకమైన రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, తక్కువ ధరకు వస్తున్నాయని కుళ్ళిపోయిన, పాడైన గుడ్లను వాడుతున్నట్లు ఆధారాలతో సహా పట్టుకున్నారు. ఫ్యాక్టరీలో కనీస పరిశుభ్రత పాటించకుండా, ఈగలు ముసురుతున్న మురికి వాతావరణంలో బిస్కెట్లను తయారు చేస్తున్నారని అధికారులు తెలిపారు….
