భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..తెలంగాణ, ఏపీలో ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్స్
దిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్రం ఉత్తమ సేవలు అందించిన అధికారులకు పతకాలు ప్రకటించింది. తెలంగాణకు ఒక గ్యాలంటరీ మెడల్, రెండు ప్రెసిడెంట్ మెడల్స్, 11 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ప్రకటించారు. ఏఎస్ఐ సిద్ధయ్య, నిడమానురి హుస్సేన్ను ప్రెసిడెంట్ మెడల్స్కు ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్కు రెండు ప్రెసిడెంట్ మెడల్స్, 20 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ప్రకటించారు.
