భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా ….ఆర్టీసీ కీలక నిర్ణయం.. డ్రైవర్లు ఫోన్లు వాడకంపై నిషేధం
తెలంగాణ :
📍ప్రయాణికుల భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
బస్సు నడిపే సమయంలో డ్రైవర్లు సెల్ ఫోన్లు వినియోగించడాన్ని నిషేధించాలని నిర్ణయించింది.
ఈ మేరకు నేటి (సెప్టెంబర్ 1) నుంచి పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయనుంది.
ఎంపిక చేసిన 11 డిపోల పరిధిలో ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలవుతుంది.
గ్రేటర్ జోన్లోని ఫరూక్నగర్, కూకట్పల్లి డిపోలు ఈ జాబితాలో ఉన్నాయి..
