జర్మన్ ఛాన్స్ లర్ ప్రెడ్రిచ్ మెర్జ్ తన తొలి భారత పర్యటనలో భాగంగా నేడు అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు..

భారత్ న్యూస్ ఢిల్లీ…..జర్మన్ ఛాన్స్ లర్ ప్రెడ్రిచ్ మెర్జ్ తన తొలి భారత పర్యటనలో భాగంగా నేడు అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు..

ఇద్దరు నేతలు కలిసి సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం సబర్మతీ రివర్‌ఫ్రంట్‌లో అంతర్జాతీయ గాలిపటాల పండుగను ప్రారంభించారు. 11:15 గంటలకు గాంధీనగర్‌లో జరిగే ద్వైపాక్షిక చర్చల్లో రక్షణ, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, నైపుణ్యాభివృద్ధిపై కీలక ఒప్పందాలు జరగనున్నాయి.