భారత్ న్యూస్ హైదరాబాద్;ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ శ్రీ మార్క్ లామీ గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. హైదరాబాద్లో ఫ్రెంచ్ సంస్థల సహకారంతో అమలవుతున్న ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణలో పెట్టుబడులను విస్తరించాలని ఫ్రెంచ్ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించారు. హైదరాబాద్ నగరంలోని ఫ్రెంచ్ బ్యూరో కార్యాలయాన్ని బలోపేతం చేయడం ద్వారా ఇరుపక్షాల మధ్య మరింత సన్నిహిత సహకారం కొనసాగించవచ్చని సూచించారు.

సమావేశంలో అలయన్స్ ఫ్రాన్స్ హైదరాబాద్ డైరెక్టర్ శ్రీమతి మౌద్ మిక్వా గారు, ఫ్రెంచ్ బ్యూరో అసిస్టెంట్ శ్రీమతి రోహిణి రెడ్డిపల్లి గారు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.