.భారత్ న్యూస్ హైదరాబాద్….దేశంలో జనగణన ప్రారంభం
దేశంలో జన గణన 2027 ప్రారంభమైంది. జనాభా లెక్కల సేకరణలో భాగంగా రాష్ట్రపతి భవన్లో జరిగిన స్వీయగణనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. హోం సెక్రటరీ గోవిం ద్ మోహన్ సమక్షంలో రాష్ట్రపతి ముర్ము ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో తన కుటుంబ వివరాలను నమోదు చేశారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అలాగే ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కూడావెబ్సైట్లో తన కుటుం బ వివరాలు నమోదు చేశారు. తాను కూడా తన వివరాలను నమోదు జేసినట్టు హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. కాగా, జనాభా లెక్కల సేకరణ 2027ను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు