తెలంగాణలో మరో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు?

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలంగాణలో మరో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు?

హైదరాబాద్:నవంబర్ 15
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మంచిజోష్ మీద ఉంది. అయితే తెలంగాణలో మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదురుకునేం దుకు కాంగ్రెస్ కాబోతుందని తెలుస్తుంది,బీఆర్‌ఎస్, నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్,కడియం శ్రీహరి, లపై త్వరలో స్పీకర్ వేటు వేసే అవకాశం ఉంది,

స్పీకర్ నిర్ణయం తీసుకునే లోపు ఇద్దరితో రాజీనామా చేయించాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తుంది దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యం కావచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన పలువురిపై స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతోంది.

ఈ విచారణ లో దానం నాగేందర్, కడియం శ్రీహరిల వ్యవహారం కీలక ఘట్టానికి చేరుకుంది. దానం నాగేం దర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. ఈ చర్య ద్వారా ఆయన పార్టీ మారినట్లు స్పష్టంగా రుజువైంది. ఇక కడియం శ్రీహరి సైతం పార్టీ మారినట్లు బహిరం గంగా అంగీకరించారు. దీంతో వీరిపై స్పీకర్ వేటు వేసే అవకాశం ఉందని, తద్వారా వచ్చే ఉప ఎన్నికలో వీరికే టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని 24 వేలకు పైగా మెజార్టీతో గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే గెలుపుపై అత్యంత ధీమాతో ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో పాటుగా ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీ పథకాల పట్ల ప్రజల్లో సానుకూలత ఉండటం తమకు అదనపు బలంగా మారుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.

గతంలో స్పీకర్లు ఫిరాయింపు కేసులను సాగదీసినప్పటికీ, ప్రస్తుతం రాజ్యాంగబద్ధంగా స్పీకర్లు వేగంగా నిర్ణయం తీసుకునే వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఫిర్యాదులపై స్పీకర్ చర్యలు తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.