భారత్ న్యూస్ ఢిల్లీ…..హైదరాబాద్:డిసెంబర్ 01
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోమవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. సీఎం వ్యక్తిగత కార్యదర్శి తో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్, కూడా ఈ నోటీసు లు అందాయి.. ఈడీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం..
జారీ చేసిన ఈ నోటీసులో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నిబంధనలను ఉల్లంఘిం చినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్, కేఐఐఎఫ్బీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎమ్ అబ్రహాం కూడా ఈ నోటీసులు అందుకున్నారు.
ఈడీ గత మూడేళ్లుగా ఈ కేసుపై దర్యాప్తు నిర్వహిం చి.. సెప్టెంబర్లో తన నివేదికను అడ్జుడికేటింగ్ అథారిటీ ముందు సమర్పించింది. మసాలా బాండ్ల ద్వారా సేకరించిన నిధులను.. ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ భూమి కొను గోలుకు ఉపయోగించినట్లు ఈడీ ఆరోపిస్తోంది.
కేరళ మౌలిక సదుపాయాల నిధి బోర్డు (కేఐఐఎఫ్బీ) 2019 ఏప్రిల్లో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా చేయడం ద్వారా మసాలా బాండ్ల రూపంలో రూ. 2,150 కోట్లు నిధులను సేకరించింది. ఈ బాండ్ల జారీపై ఈడీ 2021లో దర్యాప్తు ప్రారంభించింది.
అయితే ఈడీ నోటీసు అందినట్లు మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ కూడా ధృవీకరించారు. అయితే ఈ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. “ఇదంతా అనవసరం. మేము భూమి కొనుగోలు కోసం ఆ నిధులను ఎప్పుడూ ఉపయోగించలేదు. కేఐఐఎఫ్బీ ప్రాజెక్టుల కోసం భూసేకరణ నిబంధనల ప్రకారమే జరిగింది.

ఈ ఈజీ నోటీసు ఎన్నికల స్టంట్లో భాగమే” అని ఐజాక్ అన్నారు. కేఐఐ ఎఫ్బీ సీఈఓ అబ్రహాం ఈ నోటీసుపై స్పందించడానికి నిరాకరించగా.. ముఖ్యమంత్రి అదనపు వ్యక్తిగత కార్యదర్శి రవీంద్రన్ తనకు నోటీసు గురించి తెలియదని తెలిపారు.