హర్మూజ్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలను లెక్కచేయని ఇరాన్‌..రెండు హెలికాప్టర్లను నేలకూల్చినట్టు ఇరాన్ ప్రకటన

భారత్ న్యూస్ విశాఖపట్నం..హర్మూజ్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలను లెక్కచేయని ఇరాన్‌..రెండు హెలికాప్టర్లను నేలకూల్చినట్టు ఇరాన్ ప్రకటన

పశ్చిమాసియాలో గత నెల రోజులుగా కొనసాగుతోన్న యుద్ధం(Iran war) తీవ్ర ఉద్రిక్తతలకు దారిస్తున్నది. చర్చల విషయంలో అమెరికా, ఇజ్రాయెల్,ఇరాన్‌ తలోదారిని వెళ్తున్నాయి. చర్చలు కొనసాగుతున్నాయి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటుంటే అలాంటివి ఏమీ లేదని, దాడులు కొనసాగుతాయని ఇరాన్ స్పష్టం చేస్తున్నది.

ఈ క్రమంలో మరోసారి హర్మూజ్‌పై ఇరాన్‌‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్‌ ఏమాత్రం వెనకకు తగ్గడం లేదు. అమెరికాకు చెందిన మరో రెండు హెలికాప్టర్లను నేలకూల్చినట్టు ఇరాన్ ప్రకటించింది. అలాగే అమెరికాకు చెందిన కొన్ని లక్ష్యాలను ఛేదించినట్లు వెల్లడించింది. దీంతో ఇప్పట్లో యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు