భారత్ న్యూస్ తిరుపతి….తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల – తిరుపతి :
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. భక్తులు కంపార్ట్మెంట్లు దాటి ఎన్జి షెడ్స్ వరకు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 90,802 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,776 తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చిందని టీటీడీ
అధికారులు తెలిపారు.
