భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ ఇంద్రకిలాద్రి ఈవో శీనా నాయక్ పై దేవాదాయ కమీషనర్ ఆగ్రహం

Ammiraju Udaya Shankar.sharma News Editor…విజయవాడ ఇంద్రకిలాద్రి పై కొనసాగుతున్న పవర్ పంచాయతీ
ఈవో తీరు పై దేవాదాయ కమీషనర్ రాంచంద్రమోహన్ అసంతృప్తి
మొన్నటి వరకు విద్యుత్ అధికారులకు దుర్గ గుడి అధికారులకు మధ్య జరిగిన వివాదం
ఇప్పుడు పవర్ వివాదం పై ఈవో శీనా నాయక్ పై దేవాదాయ కమీషనర్ రాంచంద్రమోహన్ సీరియస్
వాడి వేడిగా ఇటీవల జరిగిన ప్రత్యేక సమావేశం
దేవస్థానానికి సంబంధించిన విషయాలు ఏమి తన దృష్టికి తీసుకు రావట్లేదని ఈవో శీనా నాయక్ పై దేవాదాయ కమిషనర్ ఆగ్రహం
ఇటీవల మహా కుంభాభిషేకం పై జరిగిన చర్చల్లో పవర్ విషయంపై వాగ్వాదం
నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇరువురికి జరిగిన వాగ్వాదం
సోషల్ మాధ్యమాల్లో వచ్చిన వార్తలు వల్లే దేవాలయంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది అన్న దేవదాయ కమిషనర్ రామచంద్ర మోహన్
మార్చి 6 7 8 తేదీల్లో జరగనున్న మహా కుంభాభిషేకం పై చర్చించడానికి గొల్లపూడి ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు
ఈ సమావేశంలో ఈవో శీనా నాయక్ పై మండిపడ్డ దేవదాయ కమిషనర్
సీఎంఓ ఆఫీస్ నుంచి పవర్ కట్ గురించి తనను వివరణ కోరుతున్నారని ఈవోకు తెలిపిన కమీషనర్

వారికి ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించిన దేవాదాయ కమిషనర్