భారత్ న్యూస్ గుంటూరు ….Ammiraju Udaya Shankar.sharma News Editor…వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని గణేష్ ఉత్సవ కమిటీలకు, భక్తులకు ముఖ్య సూచనలు:
- గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకునే వారు ముందుగా కమిటీని ఏర్పాటు చేసుకొని బాధ్యత తీసుకోవాలి.
- పబ్లిక్ ప్రదేశాలలో మండపాలు ఏర్పాటు చేసేవారు సంబంధిత మున్సిపాలిటీ/పంచాయతీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
- వ్యక్తిగత స్థలాలలో విగ్రహాలు పెట్టేవారు యజమాని అనుమతి తీసుకోవాలి.
- మండపాలు, విగ్రహాలు ఎక్కడ ఏర్పాటు చేసినా ప్రజలకు, ట్రాఫిక్కి ఎటువంటి ఆటంకం కలగరాదు.
- మైకులు, సౌండ్ బాక్స్లకు డీఎస్పీ గారి అనుమతి తప్పనిసరి. డీజే లకు అనుమతి లేదు.
- రాత్రి 10 గంటల తర్వాత ఎటువంటి కార్యక్రమాలు జరపరాదు.
- హుండీలు, విలువైన వస్తువులు ఉంచినట్లయితే పూర్తి బాధ్యత కమిటీదే.
- విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ శాఖ అనుమతి తీసుకొని, షార్ట్సర్క్యూట్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఇతర మతాల వారికి, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలగకుండా చూడాలి.
- విభేదాలు రాకుండా శాంతి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి.
- సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డాన్సులు, ఇతర అనుచిత కార్యక్రమాలు జరగరాదు. ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
- ఎవరినీ బలవంతంగా చందాలు అడగరాదు. బలవంతపు వసూళ్లపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాము.
- భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలి.
- అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- నిమజ్జన ఊరేగింపుల సమయంలో మద్యం సేవించడం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం అస్సలు అనుమతించబడదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము.
- ఊరేగింపు తేదీలు, కార్యక్రమ వివరాలు ముందుగానే పోలీసులకు తెలియజేయాలి. వాహనాల డ్రైవర్ల ఆధార్ కాపీలు, వివరాలు ఇవ్వాలి.
- మండపాల ఏర్పాటు వివరాలు, నిబంధనలు పాటిస్తామన్న నోటరీ పత్రం పోలీస్ స్టేషన్లో సమర్పించాలి.

👆🏻👆🏻👆🏻పై సూచనలు పాటించడం ద్వారా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా, సాఫీగా, భక్తిశ్రద్ధలతో జరుగుతాయని అవనిగడ్డ సర్కిల్ పోలీస్ వారి తరపున విజ్ఞ్యప్తి చేయడం జరుగుతుంది.