పృథ్వీశ్వర స్వామి దేవస్థానానికి చెన్నై భక్తురాలి వితరణ

భారత్ న్యూస్ రాజమండ్రి…పృథ్వీశ్వర స్వామి దేవస్థానానికి చెన్నై భక్తురాలి వితరణ

చల్లపల్లి మండలం నడకుదురులోని ప్రముఖ ప్రాచీన శైవక్షేత్రం శ్రీ పృథ్వీశ్వర స్వామి దేవస్థానానికి చెన్నై భక్తురాలు యార్లగడ్డ విజయకుమారి – శివరామ ప్రసాద్ దంపతులు రూ.70వేలు విలువ చేసే భారీ కంచు గంట, రెండు నిలువెత్తు ఇత్తడి దీపపు కుందులు బహుకరించారు. దేవస్థానం అర్చకులు మామిళ్ళపల్లి పృథ్వీ కళ్యాణ్ పూజలు చేసి ఆలయంలో అలంకరించారు. ఈ కార్యక్రమంలో పృథ్వీశ్వర స్వామి దేవస్థాన సమగ్ర అభివృద్ధి కర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ రవీంద్ర – రమణకుమారి దంపతులు పాల్గొన్నారు.