పట్టాల మధ్య పడుకుని రీల్స్.. సజ్జనార్ సీరియస్

..భారత్ న్యూస్ హైదరాబాద్….పట్టాల మధ్య పడుకుని రీల్స్.. సజ్జనార్ సీరియస్

తెలంగాణ : రీల్స్ పిచ్చిలో పడి కొందరు యువకులు ప్రవర్తిస్తున్న తీరు ఒకింత చికాకు పుట్టిస్తుంది. SMలో ఫాలోవర్లను పెంచుకునేందుకు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా ఓ యువకుడు చేసిన పనిపై హైదరాబాద్ CP సజ్జనార్ ఫైరయ్యారు. వేగంగా రైలు వస్తుండగా యువకుడు పట్టాల మధ్య పడుకున్న వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ‘వైరల్ పిచ్చితో ఇలాంటి పనులు చేయడం సాహసం కాదు.. అది పరాకాష్ఠకు చేరిన మూర్ఖత్వం. ఒక్క సెకను తేడా జరిగినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. బాధ్యతగా ఉండటం నేర్చుకోండి’ అని పేర్కొన్నారు.