భారత్ న్యూస్ విశాఖపట్నం..ఈ నెల 21 తేదీన విశాఖలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా డేలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఆర్కే బీచ్ వేదికగా ఐదు లక్షల మంది యోగాడేకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసింది. ఆర్కే బీచ్ సహా వివిధ ప్రాంతాలలో చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎం.టి. కృష్ణబాబు, విశాఖ జిల్లా కలెక్టర్ హరెంథిర ప్రసాద్ అరేంజ్ మెంట్స్ గురించి సీఎంకు వివరించారు.
