లైంగిక కోరిక తీర్చలేదని మహిళా టెక్కీని హత్య చేసిన ఇంటర్ విద్యార్థి

భారత్ న్యూస్ గుంటూరు….లైంగిక కోరిక తీర్చలేదని మహిళా టెక్కీని హత్య చేసిన ఇంటర్ విద్యార్థి

బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో టెక్కీగా పని చేస్తున్న కర్ణాటకలోని మంగళూరుకు చెందిన షర్మిల కుశాలప్ప (34)

రామ్మూర్తినగర ఠాణా పరిధి సుబ్రహ్మణ్య లేఅవుట్లోని ఓ ఫ్లాట్లో తన స్నేహితుడితో కలిసి ఉంటున్న షర్మిల

ఈనెల 3న షర్మిల ఒంటరిగా ఉన్నవేళ ఫ్లాట్లో ఆకస్మికంగా మంటలు చెలరేగగా, ఆమె మరణించినట్లు ఫిర్యాదు అందడంతో.. ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు

అయితే ఇది సాధారణ మరణం కాదని.. ఆమె శరీరానికి నిప్పు అంటుకోకముందే చేతిపై గాయాలయ్యాయని, ఆపై ఊపిరాడక చనిపోయినట్లు ఫోరెన్సిక్ నివేదికలో ద్వారా తేల్చిన వైద్యులు

దీంతో పోలీసులు అక్కడి సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరించి.. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా బయటపడ్డ నిజాలు

షర్మిల, ఆమె మిత్రుడు ఉండే ఫ్లాట్ పక్కనే కొడగు జిల్లా విరాజ్ పేటకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి కర్నల్ కురై (18) తల్లితో కలిసి ఉంటున్నాడు.. ఈ నెల 3న షర్మిల స్నేహితుడు ఇంట్లో లేని సమయంలో కురై ఆమె ఉండే గదిలోకి కిటికీలోంచి దూరి. లైంగిక కొరిక తీర్చాలని ఒత్తిడి తేవడంతో గట్టిగా అరుస్తూ తోసి వేసిన షర్మిల

కోపం పట్టలేని ఆ యువకుడు.. వంటగదిలోని కత్తితో ఆమెపై దాడి చేయగా.. ఆమె పరుపుపై పడిపోగా, మరోసారి కొట్టిన కురై

అరవొద్దంటూ నోటిని దిండుతో గట్టిగా మూయడంతో ఊపిరాడక చనిపోయిన షర్మిల

ఆపై సాక్ష్యాలను నాశనం చేసేందుకు రక్తపు మరకలున్న ఆమె దుస్తుల్ని తీసి, అదే గదిలో నిప్పంటించి కాల్చేసిన యువకుడు

మంటలు వ్యాపించడంతో కిటికీలోంచి దూకేసి పారిపోయిన యువకుడు