ఈనెల 29న కుప్పం పర్యటనకు సీఎం చంద్రబాబు

భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఈనెల 29న కుప్పం పర్యటనకు సీఎం చంద్రబాబు

AP: CM చంద్రబాబు ఈనెల 29న కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శాంతిపురం(M) కడపల్లె పరిసరాల్లో హెలిప్యాడ్ ఏర్పాటుకు అధికారులు స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అక్కడ జరిగే రాజకీయ కార్యక్రమంలో CM పాల్గొంటారని సమాచారం. ఏవైనా అధికారిక కార్యక్రమాలు ఉన్నాయా అనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల కడపల్లె పంచాయతీ పరిధిలోని శివపురం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు గృహప్రవేశం చేసిన సంగతి తెలిసిందే.