భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఒకేసారి మూడు నెలల రేషన్..రేషన్ కార్డుదారులకు శుభవార్త..!
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని రేషన్ కార్డుదారులకు సౌకర్యవంతంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ఆదేశాలను అమలు చేసేందుకు సిద్ధమైంది.

జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు, జూన్ 1 నుంచి 30వ తేదీలోపు రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. అయితే, రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం బయోమెట్రిక్ ధ్రువీకరణను నెలవారీగా వేర్వేరుగా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం రేషన్ కార్డుదారులకు గొప్ప ఊరటనిస్తుందని, వర్షాకాలంలో సరుకుల కొరత లేకుండా ఉంటుందని అధికారులు తెలిపారు.

ఈ ఏర్పాట్లతో ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యాలు సకాలంలో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.