టెలిగ్రామ్ యాప్ క్లిక్ తో రూ.1.25 లక్షలు మాయం

భారత్ న్యూస్ అనంతపురం…టెలిగ్రామ్ యాప్ క్లిక్ తో రూ.1.25 లక్షలు మాయం

పాల్వంచ మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన మాలోత్ పవన్, తన సెల్ఫోన్లో వచ్చిన టెలిగ్రామ్ యాప్ను పలుమార్లు క్లిక్ చేయడంతో రూ.40 వేలు, మరోసారి రూ.20 వేలు చొప్పున మొత్తం రూ.1.25 లక్షలు తన ఖాతాలోంచి పోగొట్టుకున్నాడు.

మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు.