భారత్ న్యూస్ మంగళగిరి….హోం మినిస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్
AP: సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని లేకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కల్పిత కథనాలను, అబద్ధాలను ప్రచారం చేయడాన్ని వాక్ స్వాతంత్య్రంగా పరిగణించలేమన్నారు. తాము ఎప్పుడూ న్యాయమైన రాజకీయ చర్చను స్వాగతిస్తామని అసత్య ప్రచారాలను మానుకోవాలని హెచ్చరించారు.
