భారత్ న్యూస్ గుంటూరు..Ammiraju Udaya Shankar.sharma News Editor…విజయవాడ
వైఎస్ షర్మిలా రెడ్డి
APCC ఛీఫ్
- YCP అధ్యక్షులు జగన్ మోహన్
రెడ్డి గారి వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకం. - ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది ఈ ఘటన.
- కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి ?
- 100 మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్ గారు చేతులూపడం ఏంటి?
- ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు ?
- బెట్టింగ్ లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా ?
- ఇదేం రాజకీయం ? ఇదెక్కడి రాక్షస ఆనందం ?
- మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా ?
- ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా ?
- కార్ సైడ్ బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా ?
- ఇది పూర్తిగా జగన్ గారి బాధ్యత రాహిత్యాని అద్దం పడుతుంది.
- బలప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమైన జగన్ గారు..
- 100 మందికి అనుమతి ఇచ్చి వేల మందితో వచ్చినా దగ్గరుండి మరి చోద్యం చూసిన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి.
- పర్మిషన్ కి విరుద్ధంగా జన సమీకరణ జరుగుతుంటే పోలీసులు ఎలా సహకరించారు ?
- ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు ?
- ఎందుకు ఇంటలిజెన్స్ వ్యవస్థను నిద్ర పుచ్చారు ?
- ప్రజా సమస్యలపై పోరాడితే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా?
- కాంగ్రెస్ చేసే ఉద్యమాలకు, ధర్నాలకు హౌజ్ అరెస్ట్ లు చేస్తారు.
- దీక్షలను భగ్నం చేస్తారు. ర్యాలీలను తొక్కిపెట్టి మా గొంతు నొక్కుతారు.
-వైసీపీ చేసిన బలప్రదర్శనలకు, హత్యలకు జగన్ గారు ఏం సమాధానం ఇస్తారు ?
ఏం చర్యలు తీసుకుంటున్నారు ?

కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది ?