భారత్ న్యూస్ గుంటూరు….అమరావతి

Ammiraju Udaya Shankar.sharma News Editor…రెవెన్యూ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష..
• పీజీఆర్ఎస్ సహా 22ఏ, ఫ్రీ హోల్డ్లో ఉంచిన అసైన్డ్ భూములు, రీ సర్వే, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు… తదితర అంశాలపై సమీక్ష
• హాజరైన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ అధికారులు
• గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ వరకు వచ్చిన గ్రీవెన్సులు 5,28,217
• వీటిలో 4,55,189 గ్రీవెన్సులు పరిష్కరించగా, పరిశీలనలో మరో 73 వేల వరకు గ్రీవెన్సులు
• పాలనా సంస్కరణలతో ఈ ఏడాది జూన్ నుంచి వేగవంతమైన ఆటోమ్యూటేషన్ ప్రక్రియ
• జూన్ 2024 నుంచి ఇప్పటివరకు 22ఏ జాబితా నుంచి తప్పించాలని కోరుతూ దాఖలైన దరఖాస్తులు 6,846
• ఎక్స్ సర్వీస్మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్ర్య సమరయోధులు, 1954 కంటే ముందు అసైన్డ్ భూములు కలిగిన వాళ్ల భూములు 22ఏ నుంచి తొలిగింపు
• 6,693 గ్రామాల్లో పూర్తయిన రీసర్వే, వెబ్ ల్యాండ్ 2.0లో వివరాల నమోదు
• రీసర్వేలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు జరగకుండా భూమి రికార్డుల అప్గ్రెడేషన్
• గత ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్లో ఉంచిన 5,74,908 ఎకరాల అసైన్డ్ భూముల వివరాల పున: పరిశీలన
• 2.77 కోట్ల కుల ధృవీకరణ పత్రాలు ఆధార్తో అనుసంధానం

• ఈ ఆర్ధిక సంవత్సరం స్టాంప్, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.10,169 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యం
• రాష్ట్రవ్యాప్తంగా 430 రియల్ ఎస్టేట్ వెంచర్లను గుర్తించి, ఆయా ప్లాట్లకు సంబంధించి యూజర్ ఫ్రెండ్లీ రిజిస్టేషన్కు కార్యాచరణ
• దీంతో 15,570 రిజిస్ట్రేషన్లతో రూ.250 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా