భారత్ న్యూస్ శ్రీకాకుళం…రైల్వే టికెట్ రిజర్వేషన్ క్యాన్సిలేషన్.. కీలక మార్పులు
టికెట్ క్యాన్సిలేషన్, బోర్డింగ్ పాయింట్ నిబంధనలకు భారతీయ రైల్వే కీలక సవరణలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. రైలు బయలుదేరడానికి 72 గంటల ముందు టికెట్ను రద్దు చేసుకుంటే దాదాపు పూర్తి రిఫండ్ ఇవ్వనుంది. కేవలం రద్దు ఛార్జీలు మాత్రమే విధిస్తారు. 72 గంటల నుంచి 24 గంటల మధ్య రద్దు చేసుకుంటే 75 శాతం, 24 గంటల నుంచి 8 గంటల మధ్య టికెట్ రద్దు చేసుకుంటే 50 శాతం రిఫండ్ ఇవ్వనుంది
