రేపు “క్వాంటం టాక్” కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

భారత్ న్యూస్,:అమరావతి:
• రేపు “క్వాంటం టాక్” కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
• వేల మంది టెక్ విద్యార్ధులతో ఆన్లైన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు “క్వాంటం టాక్”
• రేపు ఉదయం 9.30 గంటలకు ఆన్ లైన్ ద్వారా విద్యార్ధులతో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు
• దేశంలోనే తొలిసారి అతిపెద్ద క్వాంటం విద్యా సదస్సు ద్వారా విద్యార్ధుల్లో నైపుణ్య కల్పనకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం
• క్యూబిట్, వైసర్ సంస్థలతో కలిసి రాష్ట్రంలో తొలిసారి క్వాంటం ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం…

  • ఇప్పటికే ఈ రెండు సంస్థలతో ఒప్పందం చేసుకున్న ఏపీ ప్రభుత్వం
    • ట్రైనింగ్ ప్రోగ్రాం రిజిస్టర్ చేసుకున్న 50 వేల మంది విద్యార్థులు, ఐటీ రంగ ఉద్యోగులు
    • ఈ క్వాంటం ప్రోగ్రామ్ కు 51 శాతానికి పైగా మహిళా టెక్ విద్యార్ధుల రిజిస్ట్రేషన్
    • ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక రోడ్‌ మ్యాప్ ను విద్యార్ధులకు వివరించనున్న సీఎం
    • క్వాంటం టెక్నాలజీ లక్ష్యాల గురించి సదస్సులో వివరించనున్న ముఖ్యమంత్రి
    • రాష్ట్రంలో క్వాంటం నైపుణ్యాలను తీర్చిదిద్దేలా క్యూబిట్, వైసర్ సంస్థలతో కలిసి క్వాంటం ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
    • అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన 3 వేల మందికి తదుపరి స్థాయి శిక్షణ, 100 మందికి ఐబీఎం, టీసీఎస్, సహా సీడాక్ లలో శిక్షణ అవకాశాలు
    • ఏపీ నుంచి లక్ష మంది క్వాంటం నిపుణుల్ని తయారు చేయటమే లక్ష్యంగా క్వాంటం ప్రోగ్రామ్