భారత్ న్యూస్ మంగళగిరి ….Ammiraju Udaya Shankar.sharma News Editor…నారావారిపల్లెకు స్కోచ్ అవార్డు
అమరావతి :
ఏపిలో పీఎం సూర్యఘర్ పథకం కింద సీఎం చంద్రబాబు సొంత జిల్లా స్వగ్రామం నారావారి పల్లెకు స్కోచ్ అవార్డు దక్కింది.
పైలట్ ప్రాజెక్టుగా ఎ.రంగంపేట, కందులవారిపల్లి, చిన్నరామాపురం, నారావారిపల్లెలో 1600ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులను తక్కువ వ్యవధిలో అధికారులు పూర్తిచేశారు.
దీనికి గుర్తింపుగా ‘స్వర్ణ నారావారిపల్లె’ కింద గుర్తిస్తూ స్కోచ్ గ్రూప్ తిరుపతి జిల్లా కలెక్టర్కు లేఖ పంపింది.

సెప్టెంబరు 20న ఢిల్లీలో జరిగే స్కోచ్ సదస్సులో అధికారులు అవార్డును అందుకోనున్నారు.