భారత్ న్యూస్ గుంటూరు…6 నెలల్లో రూ.1,500 కోట్లు టోకరా.. పెట్టుబడుల మోసాల బారిన 30 వేల మంది
🪙 గడచిన ఆరు నెలల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్టుబడుల కుంభకోణాల బాధితులు 30,000 మందికిపైగానే ఉన్నారు. వీరు రూ.1,500 కోట్ల మేరకు నష్టపోయారు. ఈ కేసుల్లో 65 శాతం మేరకు బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, హైదరాబాద్ల నుంచి వచ్చాయి.

🪙 బెంగళూరు అత్యధిక ఆర్థిక నష్టానికి గురవుతున్న నగరం. పని చేసే వయసు గల వారే అత్యధికంగా బాధితులవుతున్నారు. బాధితుల్లో 76 శాతం మంది 30-60 సంవత్సరాల మధ్య వయస్కులు.